Saturday, March 2, 2013

రావురు కలం- అసలు నీకెమన్నా పిచ్చా?

    రావూరు    కలం -    అసలు     నీకేమన్నా   పిచ్చా?

             చాలా మంది   ఊత   పదాలు   వాడుతూ వుంటారు. సంభాషణ  మధ్యలో   ఆపదాలు     తమాషాగా  అతు క్కొంటూ      వుంటాయి . ....... మొజాయిక్ లో   తెల్ల,నల్ల ,పచ్చ    బిళ్ళ లల్లే !అసలా  పదం లేందే   వారికి    సంభాషణే    జరగదు. 
                                     మా  వూళ్ళో ఒకాయన      వుండే   వాడు . ఆయనగారు     ఏది    మాట్లాడినా  మధ్యలో ...ఏ మిటి !నీకు    పిచ్చేమిటి? అనడం     మామూలు . ఎంతటి     వాళ్ళతో     మాట్లాడుతున్నా  హటాత్తుగా     ఆమాట     పది  తీరవలసిందే!  ఒకసారి  భూమి  శిస్తు కి సంబంధించిన      కేసు వచ్చి  తహసీల్ దారు     దగ్గరికి   వెళ్లాడాయన . తహసిల్ దారు    అడిగాడట "నువ్వు   అదనం గా శిస్తు   కట్టాలి . నువ్వు    పోరంబోకు కలుపుకొన్నట్లు    రుజువైంది 'అన్నాడట . 
            ఈ పెద్ద మనిషి వెంటనే   "నేనేమి     పోరంబోకు   కలుపుకొలెదు. సర్వే   రాళ్ళు  అలా అమ్మతల్లులల్లే   ఉండగా నేనెలా కలుపుకొంటాను?మీరెలా     ఒప్పుకొంటారు?   అయినా  మీకేమన్నా   పిచ్చా?...... కరణం గారి లెక్కల్లో   ఏదో తప్పుంది . లేకపోతె    తరతరాలుగా    మా  వూళ్ళో  "తీరువ బాకీ    లేని దేవరయ్యా?  అంటే ...తిరుపతయ్యె నని చెపుతారు. .......... మీకేమన్నా పిచ్చా?అన్నాడుట . 
              తహసిల్ దారుకి కోపం   వచ్చి  డ ఫేదార్?   వంక చూచి   "నాకు పిచ్చంటా డేమిటి ?బయటికి     పంపు, తీరువ  మూడు    రెట్లు   చేస్తున్నాను "అన్నాడట . 
                      అది విన్న పెద్ద మనిషి "అదేమిటి?    నేనే మన్నా నిపుడు? తీరువ కట్టక్కర లేదన్నాను . మూడు రెట్లంటా  రేమిటి? మీకేమన్నా పిచ్చా?అన్నాడట . 
          అప్పుడా    ఆఫీసరు    గారికి  తెలిసిందట  అది  అతగాడి   ఊత  పదమని. 

                 వూళ్ళో    ఎవరన్నా కనిపించి ..ఏ మీ తిరుపతయ్యా..కులాసా అంటే "ఆ..   కులాసే!  కోడె దూడ నమ్మితే    మూడొంద లొచ్చాయి. ... దాంతో   ఒక    పాడి   గేదెని   కొన్నాను. .... రెండు పూటలా    పెరుగు పోసుకొంటున్నాము . నీకేమన్నా    పిచ్చా? అనేవాడు . 
               "నువ్వు పెరుగు పోసుకొంటే     మాకు ఫై చ్చేమి టయ్యా !....ఇంకొ గేదెని కొనుక్కో!వెన్న ముద్దలు కూడా   మింగు .అని   అవతల  వాళ్ళ వెళ్లి పోయే   వాళ్ళు . 
                                       ఒకసారి   మా ఊరికో    కొత్తల్లుడు   వచ్చాడు . ప్రొద్దున అతడు    చెరువు    గట్టు    మీద వుండగా   ఈ     ఊత   పదం   పెద్దమనిషి వెళ్ళా డు . వెళ్ళిన తర్వాత     ఏదో      పలకరించాలిగా "ఏం  ఎప్పుడొచ్చారు?పది రోజులుంటారా!    వానా కాలమేగా    వుండిపో!  మీ  మామ   మంచాడే!   -ఏమిటి?   వుంటావా ?అసలు నీకేమన్నా     పిచ్చా!'అన్నాడు . 
                            ఆ అల్లుడు ఖంగారు   పడి   తనకు పిచ్చి అని ఎవరు చెప్పారీయనకు?  మా    మామకు పడని   వాళ్లె వరన్నా ఉన్నారేమో   వూళ్ళో నని ,ఆ పెద్ద మనిషితో   అన్నాడు " నాకు పిచ్చేమిటి?    నాకేం లేదు . శుభ్రం   గా  వున్నా!మా పెదనాన్నకు కొంచెం  పిచ్చి ఉండేదిట . ... ఆయన పోయాడు" అన్నాడు . 
                                                 ఆ పెద్ద మనిషి    పగల బడి నవ్వి " ఆ మాట     చెప్పవేం!  ఇంట   ఆలస్యం గా   చెప్పావెం! నీకేమన్నా పిచ్చా? అనుకొంటూ   వెళ్లి పోయాడుట . ఆ కొత్తల్లుడికి    నిజం గా    పిచ్చెక్కి నంత   పనయింది . తర్వాత గానీ     తెలియ లేదు అది  ఆయనకీ   ఊత పదమని. 
               **********************            7-7 1979
    




1 comment:

  1. ఒక ఊతపదం మీద మంచి చమత్కారమైన సంఘటనలను కూర్చారు. బాగుంది.

    ReplyDelete