Friday, November 22, 2013

డా సి. నారాయణ రెడ్డి మానవత నారాధించే మధుర విపంచి

        మానవత నారాధించే   మధుర విపంచి
         డా సి. నారాయణ రెడ్డి 
{భాషా కుటీరం లో    రావూరు డా సి నారాయణ రెడ్డిగారికి సన్మానం చేసి  అభినందన సంచిక ప్రచురించింది అందులో రావూరు రచన .}
                 కాల పరిణామం లో సంవత్సరానికో వసంతం . కవికి జీవిత మంతా వసంతమే!అతని హృదయ ము ఆరామం .... భావాలు  పూల మొగ్గలు.శైలి పసిడి నిగ్గులు. ..... కావ్యాలు పొదరిళ్ళు -సందేశాలు పుప్పొళ్ళు. 
                సామాన్యం గా చెప్పుకోతగ్గ ఉపమానాలివి. కొందరు కవుల జీవితాలలో వసంతం ఒక పరువుగా వచ్చి మాయమవుతూ వుంటుంది . తిరిగి ఎప్పుడో చెప్పకుండా చివుళ్ళు పట్ట వచ్చు. ... వాటిలో ఒక మొగ్గ   తొంగి చూడవచ్చుఽవి గతించిన వసంతానికి   ఆనవాళ్ళుగా  నిలుస్తాయి...... మనల్ని పిలిచి అలనాటి చరిత్రను జ్ఞాపకం చే సుకొమ్మంటాయి. కాని,కాలాన్ని స్వంతం గా మలచుకొని -జీవితమంతా వసంతంగా మార్చుకోగల వారు కొద్ది మందే వుంటారు. 
                 ఆ   ఆరామంలో ఎన్ని కొత్త మొక్కలు వెలుస్తాయో,ఎన్ని విరులు విరుస్తాయో ,ఎంత మధుర మైన తేనె జల్లులు కురుస్తాయో-అంచనా వేయడం కశ్తమ్. ;అలా వేయబూనడం ఆ కవితా హృదయాన్ని వంచన చేయడమే అవుతుంది . 
               ఆయన చేతిలో   వంద కలాలు
            అలాటి అంచనాలను మించిన కవులలో  డా సి నారాయణ రెడ్డిగారొ కరు. చేతిలో వంద కలాలున్నట్లు ,తనలో అంతు లేని బలం వున్నట్లు ,ఆయన రచనలు సాగిస్తూ వుంటారు . కొత్తదనం చెడదు -మెత్తదనం పోదు. ..  వయసు అడ్డు రాదు-మనసు పస తప్పిపోదు ఆ ధునికాన్ధ్ర కవితా ప్రపంచంలో ఆయన ఒక స్థానం ఏర్పరుచుకొన్నారు. దానికి సుస్థి రత  కల్పించుకొన్నారు.
                        అటు సాహితీ రంగంలో ,ఇటు ఫిలిం ప్రపంచంలో ఆయన కవితలు పరుగులు తీస్తూనే వున్నాయి,సరస్వతి పాదాలకు గంధం పూస్తూనే వున్నాయి. .ఒక ప్ర క్క సన్మానాలు,ఒకప్రక్క  సత్కారాలు
ఒక ప్రక్క బహుమానాలు,ఒకప్రక్క కీర్తి తోరణాలు . ఆయన సవ్య సాచి అనిపించుకొన్నారు. భవ్య మనస్కుడని  అనిపించుకొన్నారు.
                      ఫిలిం రంగం లో ఆయన గేయరచయితగా "రికార్డు"నెలకొల్పు కొన్నారు". రెడ్డిగారి  పాట  లేందే ఫిలిం బయటికి రాదు-అసలు సెన్సారు ఆమోదించదు " అని హాస్యంగా అనుకోవడం కూడా కద్దు.రెడ్డి గారు వ్రాసినాన్ని ఫిలిం గేయాలు ఏభాషలో ఎవరు వ్రాసి వుండరు . అవి వెయ్యి ఏనాడో దాటి రెండో వెయ్యి నండుకోవడం కోసం ఉయ్యాలలూగుతూ ముందుకు ఉరుకు తున్నాయి. 
                విమానానిదే ఆలస్యం 
                 "గులేబ కావళి "  చిత్రం ద్వారా రెడ్డిగారు ఫిలిం పరిశ్రమకు పరిచయం అయారు. "నన్ను దోచుకొందు వటే " అన్న పాట వ్రాసిన వేళా విశేషం -అప్పటి నుంచీ  ఇప్పటి వరకు ఆయన కలం నిర్ఝరి లాగా పరుగెత్తుతూనే వుంది -వయ్యారాలు ఒలక బోస్తూనే వుంది . రెడ్డిగారివలె గేయ రచన చేయగల వారుండ వచ్చు కాని ఆయన కలం కల్పించిన వ్యామోహం ,మరొకరు కల్పించలెకపొయారు.హైదరాబాదులో నివాసం.మ దరా
సు లో కవితా విన్యాసం .విమానానిదే ఆలస్యంగానీ, కలానిది మాత్రం కాదు. 
                       ఇన్ని పాటలు వ్రాసినా -కొద్ది ప్రొడ్యుసర్ల బులపాటానికి వదిలితే -అన్నిటిలో భావ గాంభీర్యం ,భాషా సౌందర్యం,తొణికిస లాడుతోనే వుంటాయి . భావనా,చిత్రణా లేని గేయం ,సంపాదనా ,సౌజన్యం లేని భర్త వలె  పేలవం కాక తప్పదు. రెడ్డి గారు ప్రతి పాటలో తమ సహజ ప్రతిభను  వెలారుస్తూ వుంటారు. ..... పన్నీటి దీపాలు వెలిగిస్తూనే వుంటారు .
                   మల్లియలారా-మాలికలారా 
                    మౌనముగా నున్నారా...... 
                     మా కథ విన్నారా ?
       -వంటి అతి మధుర మైన గేయాలు వందల కొలది వున్నాయి. 
                 "పోలేవునీవు 
                 రాలేను నేను 
                 నీదారిలోనే నే 
                 నిలిచినాను -
     -వంటి భావ పూరిత మైన పాటలు ఎన్నో వున్నాయి. ఇలాటి వన్నీ ఏరితే ఏటి వొడ్డు  కోయిల గుంపులు ఒక్కసారిగా గొంతెత్తి కుహుకుహు  ధ్వానాలు చేసినట్లుంటుంది . ఇలాంటివెన్నో...... 
                    ఒక్క "ఏకవీర"చిత్రానికి  మాత్రంసంభాషణ 
లు వ్రాసారు . "సంభాషణలు వ్రాయాలనే కోరిక నాకు లేదు..... అదొక ప్రత్యేక కృ షి -తీరిక వుండాలి." అన్నారాయన  ఒకసారి .పాటలు వ్రాసి కెంపులు,పచ్చలు 
విసిరినట్లు విసిరి రావడం ఆయన అలవర్చుకొన్న విద్య.
               గ్రంధ రచనలో రెడ్డిగారు సిద్ధ హస్తులు .ఇప్పటికీ ఇరవై పైగా గ్రంధాలు వెలువడినాయి .ఆన్నిటిలోఏదో ప్రత్యేకత .... ఏదో ఉద్విగ్నత ..... ఉజ్వలత 
వచన కవితలో కొత్త పరవళ్ళు దిద్దింది వారి కలం .ఆపరవళ్ళలొ పాఠక లోకం మునిగి ముచ్చటలు పడుతూ వుంటుంది. రేడియో నాటికలకు జీవం పోసిన వారిలో వీరొకరు . 
             గేయ ప్రపంచానికి రత్న కిరీటం 
                       హిందీ,అరవం ,మరాఠీ ,వంగ భాషలలో కూడా ఏకవీ ఫిలింలకు ఇన్ని గేయాలు వ్రాసి వుండరు. అలాగే ఘంటసాల వారివలె ఏనేపథ్య గాయకుడు అన్ని పాటలు పాడి వుండడు . ఆ విధంగా ఒకరు ఫిలిం గేయ ప్రపంచానికి,మరొకరు సంగీత ప్రపంచానికి రత్న కిరీటాలు
గా అవతరించారు . ఇద్దరికీ జోహార్లు చెప్పక తప్పదు. 
                   సామాన్యంగా సరస్వతి చోటు చేసుకొన్న వీటిలో లక్ష్మి ప్రవేశించ దు . కవి ఎంత భోగలాలసుడో అంత చింతా క్రాంతుడుగా  వుండాలని ఆమె సంకల్ప మెమో!నారయణ రెడ్డి గారి విషయంలో ఇద్దరు సఖ్యత పడ్డారు . ఆయన ఇంట చెమ్మ చెక్క లాడుతూ వుంటారు. అందుకనే  ఆయన్ని "ఆంద్ర రవీంద్రుడు "అనాలనిపిస్తుంది . 
                వేములవాడ ప్రాంతం లోని హనుమాజీ పేటలో సింగిరెడ్డి వారింట జన్మించిన ఒక లేత మనసు,భీమేశ్వరాలయ ప్రాంగణం లో వలయాలుగా తిరిగే గానాలలో నుంచి సరిగమలు సంతరించుకొని .వాటి మీద సాహిత్యపు రజను జల్లుకొని ,తెలుగుతల్లి మెడలో వెలలేని హారాలు వెయ్యాలని కళలు గని -నేటికి డా నారాయణ రెడ్డి గా మారాడు . 
                       రెడ్డి రాజుల శౌర్యాన్ని ,ఆంధ్రుల వీరత్వాన్ని ,అమర కవుల భావనా పటిమను ,తెలుగు కవుల రచనా నైపుణ్యాన్ని ,ఆధునికుల ప్రగతి శీలతను పూల సజ్జలాంటి ఒజ్జల హృదయం ,సజ్జనులకు కానుకగా అమరే సౌజన్యం -ఆయన జీవితం లో ఇంద్ర ధనుస్సు లాగా ఒళ్ళు విరుచుకొన్నాయి-ఒంపులు దిద్దుకొన్నాయి. 
                     ఎన్నో చెప్పడం కంటే ఒక చిన్న మాట చాలుఈయన్ని గురించి అ దే ఆయన  జీవిత చరిత్ర లాంటి గ్రంధమవుతుంది . ఏమిటా ఒక్క మాట?....... "మానవత నారాధించే మధుర విపంచి -శ్రీనారాయణ రెడ్డి ". 
          ***********************************    
   
                       


                   
                       









  
                               

Wednesday, March 27, 2013

కనిపించడం లేదు నాటిక రచన రావూరు

        కనిపించడం    లేదు              నాటిక                                                        రచన-   రావూరు

ర- మా  ఫ్రెండ్      రాధ    వస్తూంది . పొద్దున్నే   ఆవిడకేమి     కనపడటం     లేదో!రా ..రాదా ! రా.... రా ఏమిటివాళ
పొద్దున్నే    వచ్చావ్ !
రాధ- రమా   మీ     ఇంట్లో      స్పోర్ట్స్   వరల్డ్ పుస్తకం తెచ్చారా?
ర -తేవడం    తెచ్చారు  గానీ   తర్వాత మళ్ళీ      కంటికి       కనకనబడ లెదు.
రా- అయ్యో! ఏమయింది     మరి?
చం - మా ఇంట్లో దెయ్యాలూ     భూతాలూ      తిరుగుతున్నాయి     రాధగారూ!మా ఇంట్లో   ఎవస్తువూ    కనబడటం    లెదు.
రా- మీ వస్తువుల సంగతి      నాకెందుకు   గానీ      స్పోర్ట్స్     వరల్డ్     కనిపిస్తే ఒమాటివ్వు
ర -క్రికెట్  మాచ్   విశేషాల  కోసమేనా?   నీకింకా   ఈ పిచ్చి     వదిలే      దారి   కనబటం   లేదు    రాధా!
[రాధ  నవ్వి      వెళ్లి     పోతుంది . ]
ర- ఇన్ని కబుర్లు చెపుతున్ది.పుస్తకమ్ మటుకు   కొని    చదవదు. మన తెలుగు    వాళ్ళల్లో   పుస్తకాలు కొని చదివే    వాళ్ళే     కనబడటం     లేదు. .
చం - ఓహో!సుందరమా!రా!రా!
సుం - మా  నాన్న గాని ,మా     అమ్మ   గాని       కనిపించారా  మీకు?
చం - మీ    నాన్న   వచ్చి వెళ్ళా  దిప్పుడే     మీ  అమ్మ    కనిపించలా !   ఇక్కడ పెట్టిన   అయిదు రూపాయల నోటు     కనిపించడంలా !
సుం -నిన్నటి నుంచీ     పంజాబ్ లో   ముగ్గురు   ఎమ్ ఎల్ ఏ లు కనిపించడం    లేదట!మరో  రాష్ట్రం   లో మంత్రి  వర్గ   నిర్మాణానికి     మార్గమే   కనిపించడం    లేదట!
చం - బాబూ !కనిపించడం లేదు      గొడవలు     చెప్పకు. ప్రాణం విసిగి పొతొన్ది. కనిపించేవేవైనా    వుంటే  చెప్పు. 5రూపాయలు     కనిపించడం లా!సంసారం చేసే      మార్గం    కనిపించడంలా-
సుం - పొద్దుటి నుంచి   ఓ మిత్రుదికోసం   తిరిగా     ఎక్కడా       కనిపించడంలా,    ఇంటికివస్తే   అమ్మా,నాన్నా   కనిపించలా!
చం - మరి ఎం కనిపించిందోయ్    నీకు?కనిపించిందోకటి      చెప్పు?
సుం - [నవ్వుతూ]  కనిపించినవి      చెప్పమన్నారా!కోపంతో   వున్నా  మీరు, మీ వెనక   నవ్వుతున్న    మీ  భార్య .
చం- ఇదేనా   కనిపించింది   నీకు.చాల్లె! ఇక్కడినుంచి    బైటకు   పద   మున్దు. ఊ ....ఊ నడు      అవతలకు            .కనిపించదంలా ,కనిపించడంలా-  ఒకటే     కాకి గోల కనిపించేది    ఒకటే   మాయ=కలియుగ    మాయ.
ర- ఆ!మీవన్నీ   సొద్యాలు.
చం - నీ  కన్నీ   మంగళ      వాద్యాలు.
కాక పొతే    ఏమిటండీ!అగ్గిపెట్టె,సిగరెట్టూ  పెట్టె   కనిపించనంత   మాత్రాన ఏమీ   కనిపించలేదంటారేం !వాటి   మాటవదిలి   మీకు     ఇంకేం     కనిపించలేదో చెప్పండి,వెతికి తెస్తాను.
చం- కనిపించనివి చెప్పాలా!చెప్పనా?   కోప్పడవు కదా?  నీలో    పతి  భక్తీ- నాలో      అనురక్తి.
ర- నా      పాటి భక్తీ కెమండోయ్ .నెను మీతో    చెప్పకుండా   ఎప్పుడైనా    గడప    దా టానా ?
చం-గడప దాటలేదులే!   ఇంట్లో     వుండీ      గడి   దాటేవాళ్ళు   లేరూ!
ర- ఆ గళ్ళ సంగతి    నాకు     తెలియదు . ఇళ్ళల్లో   కూడా   గళ్ళుంటాయా!
చం- ఉండవూ   మరి,విచిత్ర      దాంపత్యాలలో      వింత   ముళ్ళు     చాలా    వుంటాయి-
   [బయటనుంచి,చంద్రం   గారూ!  అనిపిలుపు]
చం- కనక బ్రహ్మం    గారా!రన్ది.... రండి,కోర్చోండి.
కన -  ఎంత     విచిత్రం గా     వుందయ్యా!ప్రపంచం?
చం-    మీకూ    అలాగే      వుందీ !ఏమిటో      చెప్పండి      కొంచెమ్.
కన -ఏం     చెప్పను?   అవతల    ఆడ పిల్ల  కూడావుంది
చం- ఫర్వాలేదు,చెప్పండి ,మీరనుకున్నంత  గాభరా  ఏమీ   లేదు.
కన -    ప్లీడర్    కోటేశ్వర   రావుగారి    అబ్బాయి  ,ఆర్నెల్ల  నుంచీ      కనపడటం     లేదట!బంధువులందరికీ   ఉత్తరాలు   వ్రాసారుట !  పత్రికలలో      ఫోటోలు కూడా    వేశారుట !
ర- ఎన్నేళ్ళవాడు?
కన -కనిపించకుండా   వెళ్ళె  ఈడే   కానీ.......
చం- ఏమిటి   కానీ     అంటున్నారు?
కన -వట్టి      నత్తి   సన్యాసి.ఎవర్నెనా    పలక రించడానికి       పది   నిముషాలు       పడుతున్ది..    అలాటిది  ఆడపిల్లని-
చం- అలాగా!     అయినా    పలక రించా డం     దేనికి.పావు ఠా ఉ   కాగితం   తీసుకొని   గుండెలు   చీల్చుకొంటూ  నాలుగు  ముక్కలు     వ్రాస్తేవెతుక్కొంటూ     వచ్చే    వాళ్ళున్నారు. వాడికి   నత్తి   అయితేనేం  -మొత్తం   ఆస్తికి    వాడిగా    వారసుడు.
ర- ఇంకేమండీ !అన్నం  నీళ్ళకు కరువుండదు,కొన్నన్ని    చీరలు  కోన వచ్చు.
చం- పిల్లాడు   కనపడ లేదని    ఆయన అంటుంటే      వాళ్ళ   సంసార     స్వరూప మంతా    వర్ణిస్తావేమిటేనువ్వు?
ర-ఆ!    కనపడక      ఎక్కడికి వెడతాడు? ఏకన్నె    పిల్లనో    వెతుక్కొంటూ   వుంటాడు.
కాన- ఏం   వెతుక్కొడమో!ఏమిటో!అనుకూల     దాంపత్యాలు   ఎక్కడా      కనపడటం    లేదమ్మా!
చం- ఎక్జాం పుల్      కావాలంటే    మా   అడ్రెస్ ఇవ్వండి.
కాన- ఇంకో     విచిత్రం  ఏమిటంటే   ఈతడు     వెళ్ళిన  రోజు     కాకుండా  ఆ కిందటి రోజునుంచి    వాళ్ళింట్లో     అయిదు   వందల   రూపాయలు      కనిపించడం లేదట.
చం- అలాగా!కనిపిస్తే     అబ్బాయి   కనిపించ   వచ్చు   గానీ  అయిదువందల రూపాయలు  కనిపించడం     అబధ్ధమ్. ఇందాక   ఇక్కడ పెట్టిన   అయిదు   రూపాయలు     కనిపించడం    లేదు. మా   ఇద్దరి   కళ్ళూ     కలిసి  నాలుగు   కళ్ళు . అందులో కొంచెం  పెద్దా- చిన్నా     వున్నయనుకోండి.   మా  ఆవిడవి     విశాల నేత్రాలు మరి.
కన - ఇవన్నీ    కనపడక   పోయినా     ఫర్వాలేదు.ఎవ్వరికీ     ఏదారీ     కనిపించని   రొజులివి.  మా  పెద్దాడికిన్త వరకు     ఉద్యోగం      గీత   కనిపించలా!మా   చిన్నాడికి     పదో   క్లాసు   పాసయ్యే      మార్గం   కనిపించడమ్లా! మా  మరదలికి   మగ సంతాన   భాగ్యం   ఇంతవరకు   కనిపించలా-
ర- బాగున్ది  మీ    కింకే మి    కనిపించలేదు?
కాన- ఏమి చెప్పను?నేను వ్రాసిన   "కనిపించని   దైవం'"   అనే వ్యాసాలు        వేసే   పత్రిక   కనిపించడం  లేదుఇన్తవరకు. .   అన్నీ     చెదలు పట్టి  పోతున్నాయ్ .
ర- అయ్యో     పాపం!దైవానికి సంబంధించిన      వ్యాసాలే   అచ్చు   పడటంలా?
చం- ఏమిటే!   నీ  ఆశ్చర్యం?ఈమధ్య   దేవాలయాల్లో   దేముళ్ళే     కనపడటం లా-కొందరు   దేముళ్ళ  మేడల్లో     నగలు   కనిపించడమ్లా.
కన -అసలు  ప్రపంచం   సరిగా   నడిచే   మార్గం     కనిపించడంలా-
ర-  కలికాలం    కదండీ!అన్నట్లు    మొన్న ఒక  ఆవిడకి     పున్నమి  నాడు   వెన్నెలే  కనిపించలేదట!ఆకాశం  మీద   బండి    చక్రం   లా  వున్నా  చంద్రు డే    కనిపించాలేదుట!
కన -ఇది    మరీ     ఆశ్చర్యం    గా   వుండే!సరేమరి,ఇహ     నే వెళ్ళోస్తా.
                               [లేచి      బయటకు   వెళ్లి పొతాదు.]
చం -   అమ్మయ్య    వదిలాడు-ఆ చిల్లర   డబ్బులుంటే    చూడు,వెళ్లి సిగరెట్లు     తెచ్చుకొన్తా.
ర- ఇప్పుడెక్కడ     కనపదతాయండేఏ-అప్పు తెచ్చుకోక-
[చంద్రం గారు     చంద్రం    గారు  -అనిపిలుస్తూనే  బయట నుంచి కనక బ్రహ్మం  లోపలకు వస్తాడు]
చం - ఏమిటీ?   ఏమైందీ?
కన - వాకిట్లో పెట్టిన   సైకిలు    కనబడడం    లేదండీ!ఎలాగండీ?     ఖర్మ !- విచారించ  కండి .కనపదని    జాబితాలో    వ్రాసుకొండి .
కన -ర్యాలీ     సైకిలండీ!   చాలా  ఖరీదు.  కొంచెం    వెతికి   పెట్టండి   బాబూ!
చం- నేనా!  వెతికి పెట్టేదా! భలేవారు   మీరు.
కన -   కానని వాని  నూతగొని ,కానని   వాడు
          విశిష్ట     వస్తువున్   , కానని  భంగి
       అలా అయిన్దయ్యా  నాపని-[వెళ్ళిపోతాడు]
చం - అడ్డమైన    వాడూ  ,అది     కనపడటం లేదు,   ఇది      కనపడటం    లేదు  అని   నా  దగ్గర  కొస్తే  నేనేం   చెయ్యను?     నా   ఉద్యోగం     మానుకొని   ఈ ఉద్యోగం     మొదలు   పెట్టాలింక. వెధవ సంత -నే     వెళ్లి సిగరెట్లు    తెచ్చుకొంటా!ఇంకాసేపుంటే      మళ్ళీ     ఎవరేనా     వస్తారు.త్వరగా. తలుపేసుకో నే వెళ్తున్నా .
                     [బయటకు    వెళ్లి పోతాడు ]
ర-[స్వగతం]   హమ్మయ్య !  మళ్ళీ  ఎవరేనా    ఏదైనా    కనపడలేదు  అంటూ   వచ్చే లోపల   నే వెళ్లి   స్నానం  చెయాలి.బాబూ !
                 [రమా దేవి     కూడా     వెళ్లి పొతున్ది.]
                         సమాప్తం
                         *******


Monday, March 25, 2013

కనిపించడం లేదు నాటిక రచన -రావూరు



 నాటిక                                 కనిపించడం   లేదు                               రచన -రావూరు
*******                             ***************                             *************

                               గదిలో     ఒక       పక్కగా     ఒక      బల్ల      కుర్చీ     వుంటాయి . బల్ల మీద     రెండు
మూడు    పుస్తకాలు    అస్తవ్యస్తంగా      పడి       వుంటాయి. కొంచెం     వెనుకగా  ఇంకో ప్రక్కన  ఒక మంచం
దాని మీద      పక్క వేసి      వుంటాయి . మంచం కింద      చిన్న    పెట్టె     వుంటుంది .  ఎదురుగా  ఒక     గోడకు   కాలెండర్      తగిలించి      వుంటుంది . [చంద్రం    లుంగీ      బనీనుతో       వుంటాడు . రమా దేవి    సామాన్య    మైన        చీరలో     మధ్య తరగతి     గృహిణి    లా      వుంటుంది . ]
                            తెర లేచే సరికి    చంద్రం     ఆ    బల్ల      దగ్గర     కూర్చుని    ఏదో     చదువుతూ   వుంటాడు . తర్వాత     మెల్లగా     లేచి   ఆబల్ల    మీద      సామాను    అటూ  ఇటూ    సర్దుతూ    వుంటాడు . విసుగు పుట్టింది .
చంద్రం -    రమా!ఓ !  రమా! [ఘట్టిగా    పిలుస్తాడు . జవాబు    రాదు]
చం -ఇదో     ప్రారభ్దమ్ -నాకేదయినా      అవసర మైనప్పుడు      ఈవిడ     కూడా   కంటిక్కనపడదు . రమా !  ఓ!    రమా [ఘట్టిగా    పిలుస్తాడు .]
రమాదేవి -[లోపల్నుంచి ]ఆ!ఆ!వస్తున్నానండీ!ఎందుకలా     గావు కేకలు    పెడతారు?స్నానం చేద్దామని     వెళుతున్నాను . ఈవేళ     మీ శెలవు     కాదు  గానీ       నా     పని      తెమల నియ్యడం   లేదు . పొద్దుటి నుంచీ    చూస్తున్నాపనితరవాత     పని     చెపుతూనే     వున్నారు . ఈవేళ    నేను     స్నానం చేసే    గీత   కనపడటం    లేదు .
చం -మరేం    ఫరవాలేదు     ఒక్కరోజు   స్నానం    ఆలస్య మయితే   ఏమీ     మునిగిపోదు   కానీ,ఇక్కడ పెట్టిన   అగ్గిపెట్టె     కానీ     చూసావా?అది నాక్కావలసి   నప్పుడు    కాన పడదు.   అయినా   నా    అగ్గిపెట్టె    ముట్టు కో వద్దని   ఎన్ని సార్లు     చెప్పాను?
రమ -నా    వంటింట్లో     అగ్గిపెట్టె      వేరే   వున్దిగా. మీ సిగరెట్టు  కంపు    అగ్గిపెట్టె    నా    కెందుకండీ!   ఇక్కడే ఎక్కడొ   పడి వుంటుంది  చోడండి.[అక్కడంతా     వెతుకుతుంది . ఆ బల్ల  మీద    పుస్తకాల   మధ్య నుంచి అగ్గి పెట్టె  తీసి   ఇస్తుంది . ]ఆ!ఇదుగోనండీ    మీ    అగ్గిపెట్టి , నెమ్మదిగా     చూసుకొంటే     అదే    కనిపిస్తుంది . ఏదీ!  మీదగ్గర     ఆ  ఆర్పే     కనపడటం   లేదు .
చం -ఆ!ఆ!  సరేలే!  ఇలాతే! [తీసుకొని సిగరెట్టూ పెట్టె   కోసం  చూస్తె   అది   కనపడదు . ]
చం-  ఇక్కడ    సిగరెట్టు   పెట్టె     ఏమయినది!ఇది వచ్చేటప్పటికి      అది  మాయ మైంది .
ర-   ఎక్కడ పెట్టారు?
చం - హిమాలయాల మీద. ఎక్కడ పెడతాను  ఇంట్లోతప్ప?   ఆబల్లమీద    సిగరెట్  పెట్టె    పెట్టి ,అగ్గిపెట్టె   వెతకడం   ప్రారంభించా   అడిదోరికింది,ఇది పొయిన్ది.    ఏదీ    కనబడదు   ఈ    ఇంట్లొ-
ర-   నేను    వెతుకుతా    వుండండి .
చం- ఆ!వెతుకు,వెతుకు       నీవి     విశాల నేత్రాలుగా  !
ర- ఇదుగో నండీ,దిండు   కింద [దిండు కింద నించి తీసి ఇస్తున్ది.]
చం-    దిండు   క్రిందా?
ర-  [నవ్వి]  దిండుకింద     సిగరెట్టు పెట్టే -   ఈ     పేరుతో   ఒక     నాటకం     వ్రాసెయ్యండి.
చం -  ఇందులో   రెండు   సిగరెట్లు    వుండాలి. కనపడటం  లేదే!
ర- అయ్యో!రామ!  అవేమవుతాయండీ!    మీరే     కాల్చేసి  వుంటారు .
చం-  అవునే!  నేనే   కాల్చి  మళ్ళీ  వెతుక్కొంటున్నా!నాకు మతి మరుపు.   ఎం చెయ్యమంటావు?
ర- లేకపోతే   ఏమవుతాయండీ?
చం- సిగరెట్టు    పెట్టెలోంచి   పైకి వురికి   కిటికీ   లోంచి    బయటికి    పోయి    వుంటాయి. మాయా బజారు  సంసారం . ఆ   చొక్కా   ఇలాతే! ఓ అర్ధ రూపాయి  పడేయ్ ,వెళ్లి   తెచ్చు కొంటా![రమా దేవి    చొక్కా   తీసి ఇస్తున్ది.పెట్టె   తెరవడానికి    చూస్తె]
ర- అయ్యో!   తాళం చెవి   బల్ల మీద పెట్టానే! మీరేమైనా   చూసారా?
చం-   బాగున్ది.    నన్నే  అడగడం   ప్రారంభించావ్?  చూడు చూడు
ర- ఇందాక     ఇక్కడే    పెట్టానండీ!   ఇంతలో    ఏమైందీ!   మీ    చొక్కా  జేబులో    ఉందేమో     చూడండి    కొంచెం -
చం - నీకు కనబడని వన్నీ   నా   జేబులో   వుంటాయా? ఇదేం   గారడీ   వాడి   సంచీ    అనుకొన్నావా?
ర- ఏమైంది మరి?వెతుకుతూ వుంటా  ఈపూటకు    వెళ్లి అప్పు తెచ్చుకోండి .
చం - అప్పా!అప్పిచ్చే    వాడేక్కడా      కనపడటం    లేదు. ఎక్కడ  తేను?
ర- ఎలాగండీ తాళం చెవి?ఏమైంది మరి?   ఇక్కడే పెట్టా,నాకు   బాగా     జ్ఞాపకం   వుంది .
చం -మరి     వెతుకు   వెతుకు   [అటూ ఇటూ    పచార్లు చేస్తూ   వుంటాడు .
ర-   నే వెతకలేనండీ -ప్రతిదీ   వెతకట మే నయ్యె![కుర్చీలో   కూర్చుంటుంది]
చం -[కోపంతో]   ఎవడి  కోసం     వెతుకుతావే![దగ్గరకు వెడతాడు]    ఒక్క   చెంపకాయ     వేస్తే-ఓసినీ ...... నీ   మెళ్ళోగొలుసులొనే    వుందే !పెట్టే తియ్యి   తియ్యి     త్వరగా
ర- అవునండోయ్ !ఇందాక పెట్టు కొన్నాను.{పెట్టెలో   డబ్బులు     తీసి    ఇస్తుంది . ]
                       బయట    నుంచి     పిలుపు ------చంద్రం గారూ!
చం -నాగారాజుగారా?   రండి   రండి
నాగరాజు- చంద్రం గారూ    పొద్దుటి   నుంచీ    మా  అబ్బాయి      కనపడటం  లేదండీ!ఊరంతా    వెతికి వెతికి వచ్చాను. ఎక్కడకు పోయాడో ఏమో    మరి!
చం - మీ  అబ్బాయి కనిపించడంలా?  మా  ఇంట్లో వస్తువులు   కనపడక      యాతన    పదుతున్నాము. మీ ఇంట్లొ   మనుషులే    కనిపించడంలా ?
నాగ- వాడిని వెతుకుతానని     వాళ్ళమ్మ   వెళ్ళింది ,అదీ    కనిపించడం లెదు.    ఇల్లు    తాళం  వేసి  వుంది .
చం - తాళం   చెవి  పోగొట్టుకొని     వెతు క్కొంటొదో   ఎమో-మరి [భార్య వంక చూచి  నవ్వుతూ] ఆవిడ మెళ్ళోనె    వుండి     వుంటుంది ,పాపం  చూసుకొని  వుండదు.
ర- చాల్లెండి  సరసాలు!ఆయన భార్యా   ,పిల్లాడు   కనబడక     ఆదుర్దా పడుతుంటే
నాగ -  అసలే సంసారానికి     దారి కనబడక     అవస్థ  పడు తుంటే  ఇంట్లో  వాళ్ళూ కనబడక పోవడం  వచ్చింది . ఓపక్క పొద్దుగూకు తోన్ది. చీకటి పడితే    నాకు   చూపు   సరిగా  కనపడదు   ఎలా?తిరిగి   తిరిగి    జ్వరం   వచ్చి నట్లు గా   వుంది . ప్చ్     ప్చ్   మీ    ఇంట్లో     ధర్మా   మీటరు  గాని     ఉందా?
చం - ఏమే!  ఉందా?
ర- ఉండటానికి   వుంది . నెల రోజుల  నుంచీ    కనిపించడం    లేదు. ఎక్కడ   పడ్డదో   ఏమో?
చం - మాకు ఉండటానికి     వస్తువులన్నీ    వుంటాయి కానీఅవసరానికి   కనిపించవు. ఇదో     విచిత్ర మైన    ఇల్లు.
          సీతా    పతి     వస్తాడు
సీ -చంద్రం గారూ!అరె   నాగరాజు గారు    కూడా    ఇక్కడె    వున్నారే!   మా      కుక్క పిల్ల   పొద్దుటి నుంచీ     కనిపించడం  లేదు ..... మీ ఇద్దరిలో     ఎవరికైనా      కనిపించిందా? రమా   దేవి గారూ     మీకైనా    సరే!
నాగ- కుక్కను చూసి     మూడు    నెల్లయింది  ..చూస్తె    లాక్కొచ్చి     మీ    ఇంట్లొ     పడెయ్యనూ !చూడండి   మీకుక్క పిల్లను   వెతకడంలో   ఎక్కడైనా    మా   పిల్లవాడు గానీ,   వాడి  తల్లి గానీ   కనిపించారా?  చెప్పండి. వాల్లిద్ద్దరూ     పొద్దుటి నుంచీ     కనిపించడం    లెదు.
సీ    - మనుష్యుల  కేమయ్యా ?కాస్సేపటికి     వాళ్ళే   వస్తారు. కుక్కపిల్ల నోరు  లేనిది. ఎక్కడికి వెళ్లిందో?  ఏమయ్యిందో?  చూడాలి మరి, నే వెళ్ళోస్తా.
   [సీతాపతి     వెళ్ళిపోతాడు]
నాగ- నేనో   వెళ్ళొస్తా.   ఈప్రపంచలొ     బతకడానికి     దారి     ఎక్కడా     కనిపించడంలా!   ధర్మం అంతకన్నా    కనిపించడంలా!  [నాగరాజు   అక్కడ వున్న   అయిదు    రూపాయల    నోటు    జేబులో    పెట్టు కొం  టాడు. ] వెళ్ళొస్తా,వెతక్క పొతే     పెళ్ళాం, పిల్లల్ని     వదిలేసి   ఊరుకొన్నాడు    అంటారు. తిరగాలి   తప్పదు మరి [-కొంచెం   ఆగి]ఒకవేళ    వాల్లోస్తే    ఇంకా   గంటా   రెండు    గంటల్లో   వస్తానని   చెప్పండి . [ఒకాలికి తొడుక్కో వలసిన   చెప్పు   మరో     కాలికి తొడుగు   తాడు]
చం - అదేమిటి?   అలా     తప్పుగా    తొడుగు తున్నారు  చెప్పులు?
నాగ - ఏమిటో!   మతి సరిగాలెదు. వస్తువులు    సరిగా  కనిపించడంలా     {చెప్పులు సరిగా  తొడుక్కొని]    వస్తా  మరి.  [వెళ్లి పోతాడు ]
చం - పాపం పెళ్ళాం  బిడ్డలు   కనపడక   ఆయన   దిగులు    పదుతున్నాదు.ఇలాతి   సంసారాలు    చెయ్యడం ఏంతో    కష్టం
ర-  పోనిద్దురూ!  ఇంకోళ్ళ   సంగతి    మనకెందుకు    గానీ,నే స్నానానికి   వెళ్తున్నా
చం - సరేలే!  తలుపేసుకో!   నే వెళ్లి సిగరెట్లు     తెచ్చుకొంటా!
ర- కానీయండి!   అది లేనిదే గడిచే   ఉపాయం   కనిపించడంలా!
చం - ఏదీ!   ఇక్కడ   పెట్టిన     అయిదు   రూపాయల    నోటు   ఏమైంది?
ర- జేబులో   చూసుకోన్నారా?
చం - లేదే![జేబులో చోసుకొంటాడు .]
ర- అప్పుడే ఎక్కడ పోయిందండీ     ఖర్మ?ఎక్కడ పెట్టారు?
చం- ఇక్కడే!ఈబల్ల మీద.
ర- ఇంతట్లో     ఏ నక్క   ఎత్తుకుపొయిన్ దండీ !
చం - అంతా     మిధ్యా   ప్రపంచం   లా  వుంది .దగ్గర   వస్తువులు      కనిపించక పోవడ   మేమిటి?  ఒకటా?  రెండా?     అయిదు   రోపాయలు.
ర- కొట్టిమీరన్నా    వచ్చేది!
చం - చచ్చేది!  అసలు   నోటు     నాకు ఇచ్చావా?
ర- ఇచ్చా కదండీ!
చం - పుచ్చుకొన్న   మాట    జ్ఞాపకం   వున్ది. తలచుకొంటే       భ్రమ     లాగా  వున్ది.
ర- భ్రమ     అంటా   రేమి టండీ శ్రమ   పది   సంపాదించుకొన్న     సొమ్ము.ఇది   ఆనాగారాజు  పనే   అయి   వుంటుంది . ఉన్నంత   సేపు    ఆ   బల్ల    దగ్గరే    తారత్లాదాదు.
చం - అందుకేకాబోలు     వెళ్ళేటప్పుడు .   అంత   ఖంగారు    పద్దాదు.
                                                                                                         [  ఇంకా   వుంది]    




Saturday, March 2, 2013

రావురు కలం- అసలు నీకెమన్నా పిచ్చా?

    రావూరు    కలం -    అసలు     నీకేమన్నా   పిచ్చా?

             చాలా మంది   ఊత   పదాలు   వాడుతూ వుంటారు. సంభాషణ  మధ్యలో   ఆపదాలు     తమాషాగా  అతు క్కొంటూ      వుంటాయి . ....... మొజాయిక్ లో   తెల్ల,నల్ల ,పచ్చ    బిళ్ళ లల్లే !అసలా  పదం లేందే   వారికి    సంభాషణే    జరగదు. 
                                     మా  వూళ్ళో ఒకాయన      వుండే   వాడు . ఆయనగారు     ఏది    మాట్లాడినా  మధ్యలో ...ఏ మిటి !నీకు    పిచ్చేమిటి? అనడం     మామూలు . ఎంతటి     వాళ్ళతో     మాట్లాడుతున్నా  హటాత్తుగా     ఆమాట     పది  తీరవలసిందే!  ఒకసారి  భూమి  శిస్తు కి సంబంధించిన      కేసు వచ్చి  తహసీల్ దారు     దగ్గరికి   వెళ్లాడాయన . తహసిల్ దారు    అడిగాడట "నువ్వు   అదనం గా శిస్తు   కట్టాలి . నువ్వు    పోరంబోకు కలుపుకొన్నట్లు    రుజువైంది 'అన్నాడట . 
            ఈ పెద్ద మనిషి వెంటనే   "నేనేమి     పోరంబోకు   కలుపుకొలెదు. సర్వే   రాళ్ళు  అలా అమ్మతల్లులల్లే   ఉండగా నేనెలా కలుపుకొంటాను?మీరెలా     ఒప్పుకొంటారు?   అయినా  మీకేమన్నా   పిచ్చా?...... కరణం గారి లెక్కల్లో   ఏదో తప్పుంది . లేకపోతె    తరతరాలుగా    మా  వూళ్ళో  "తీరువ బాకీ    లేని దేవరయ్యా?  అంటే ...తిరుపతయ్యె నని చెపుతారు. .......... మీకేమన్నా పిచ్చా?అన్నాడుట . 
              తహసిల్ దారుకి కోపం   వచ్చి  డ ఫేదార్?   వంక చూచి   "నాకు పిచ్చంటా డేమిటి ?బయటికి     పంపు, తీరువ  మూడు    రెట్లు   చేస్తున్నాను "అన్నాడట . 
                      అది విన్న పెద్ద మనిషి "అదేమిటి?    నేనే మన్నా నిపుడు? తీరువ కట్టక్కర లేదన్నాను . మూడు రెట్లంటా  రేమిటి? మీకేమన్నా పిచ్చా?అన్నాడట . 
          అప్పుడా    ఆఫీసరు    గారికి  తెలిసిందట  అది  అతగాడి   ఊత  పదమని. 

                 వూళ్ళో    ఎవరన్నా కనిపించి ..ఏ మీ తిరుపతయ్యా..కులాసా అంటే "ఆ..   కులాసే!  కోడె దూడ నమ్మితే    మూడొంద లొచ్చాయి. ... దాంతో   ఒక    పాడి   గేదెని   కొన్నాను. .... రెండు పూటలా    పెరుగు పోసుకొంటున్నాము . నీకేమన్నా    పిచ్చా? అనేవాడు . 
               "నువ్వు పెరుగు పోసుకొంటే     మాకు ఫై చ్చేమి టయ్యా !....ఇంకొ గేదెని కొనుక్కో!వెన్న ముద్దలు కూడా   మింగు .అని   అవతల  వాళ్ళ వెళ్లి పోయే   వాళ్ళు . 
                                       ఒకసారి   మా ఊరికో    కొత్తల్లుడు   వచ్చాడు . ప్రొద్దున అతడు    చెరువు    గట్టు    మీద వుండగా   ఈ     ఊత   పదం   పెద్దమనిషి వెళ్ళా డు . వెళ్ళిన తర్వాత     ఏదో      పలకరించాలిగా "ఏం  ఎప్పుడొచ్చారు?పది రోజులుంటారా!    వానా కాలమేగా    వుండిపో!  మీ  మామ   మంచాడే!   -ఏమిటి?   వుంటావా ?అసలు నీకేమన్నా     పిచ్చా!'అన్నాడు . 
                            ఆ అల్లుడు ఖంగారు   పడి   తనకు పిచ్చి అని ఎవరు చెప్పారీయనకు?  మా    మామకు పడని   వాళ్లె వరన్నా ఉన్నారేమో   వూళ్ళో నని ,ఆ పెద్ద మనిషితో   అన్నాడు " నాకు పిచ్చేమిటి?    నాకేం లేదు . శుభ్రం   గా  వున్నా!మా పెదనాన్నకు కొంచెం  పిచ్చి ఉండేదిట . ... ఆయన పోయాడు" అన్నాడు . 
                                                 ఆ పెద్ద మనిషి    పగల బడి నవ్వి " ఆ మాట     చెప్పవేం!  ఇంట   ఆలస్యం గా   చెప్పావెం! నీకేమన్నా పిచ్చా? అనుకొంటూ   వెళ్లి పోయాడుట . ఆ కొత్తల్లుడికి    నిజం గా    పిచ్చెక్కి నంత   పనయింది . తర్వాత గానీ     తెలియ లేదు అది  ఆయనకీ   ఊత పదమని. 
               **********************            7-7 1979
    




Thursday, February 28, 2013

తెల్లవారినా.....

       తెల్లవారినా ........... 

తెల్లవారినా    తెలియదాయనే 
నల్లనయ్య   నా   చేరువ నుండగా    తె 

విడి  విప్పిన  నా కురులలోపల 
దాగియుంటి నే     సిగ్గు పొంగగా 
నల్లనయ్య తన   వల్లె   వాటుతో 
నన్ను కప్పేనే    మొగ్గపోలిక        తె 

పిలపిల మని పిట్టల   గుంపులు 
పిలిచితివట    భానుని     తొలిగా 
కలకలమను    మా    నవ్వుల 
కలిసిపోయె నా  రుతములు          తె 

తలుపు సందులను   
ఎరుపు    కాంతులేవో 
ఎగప్రాకగా    నే     కాంచితి కానీ 
నల్లనయ్య    కౌస్తుభ మటు నిటు 
ఊగిన దనుకొంటినే                        తె 

అందని  దొర     నా   సందిట 
పొందికగా నమరి యుండ 
తెలియునటే   పొద్దుల హద్దులు 
వినిపింపకు నాకిక     సుద్దులు          తె 

***************************

Sunday, February 24, 2013

మునిమాణిక్యం వారి ముత్యాల పంట

             మునిమాణిక్యం  వారి     ముత్యాల పంట 
         
                     సరస,సరళి సౌజ న్య     భావనల తో    నిండి  పండిన  స్త్రీ   మూర్తిని   నాయికగా   స్వీకరించి   కమనీయ  మైన     కాంతం    కధలు   సృష్టించిన    సిద్ధ  హస్తులు   శ్రీ   ముని   మాణిక్యం    నరసింహారావుగారు . కాంతం ఆంద్ర దేశం లో    ప్రతి   ఇంటా     సారస్వత     సేవ     చేసింది . ప్రతి గృహిణిని    పలకరించింది .  ప్రతి వారి  మనస్సులో    నవ్వులు చిలకరించింది . 
                        రాజ మహేంద్ర వరములో   ఒక మిత్రుని    కుమార్తె   పేరు    కాంత మట .నరసిమ్హా రావుగారు అక్కడికి       వెళ్లి నపుడు ఆ    మిత్రుడు     కుమార్తెను    మాటి మాటికి      కాంతం కాంతం అని పిలిచినప్పుడు -ఆ పేరు ఆయన కెంతో    బాగా     వున్నట్టు   తోచిందిట . ఆ పేరునే     కధలలో      నాయికకు ఉపయోగించడం     ప్రారంభించారట . తోలి సారిగా  "కాంతం"కదా వ్రాసిన శుభ  ముహూర్త మెట్టిదో     ఆ  పేరు తెలుగు   సారస్వతం లో     చిర  స్థాయిగా     నిలిచి పోయింది . 
                   కాంతం   కధలు ..... తెలుగు కద   రచనా    విధానంలో  -ఒక   వెన్నెల మలపు     కల్పించినాయి.   గార్హస్త్య జీవితం లో నుంచి   అతి సున్నిత మైన      సంఘటనలను ఎన్నుకొని   హాస్యాన్ని జోడించి ,   సభ్యతకు    భంగం   రాకుండా ,సౌజన్యత     తరిగి పోకుండా చిత్రించిన    కధలవి. "కాంతం చెప్పినట్లు"   అని  ప్రతి ఇంటా    సామెతలుగా చెప్పుకోవడం      సర్వ  సామాన్య  మైంది . 
                      కాంతం ఏదైనా గొప్ప  భావం  వెలి  బుచ్చిందని,సరసంగామాట్లాడిందని, సమస్యను చక్కగా    పరిష్కరించిందని ,అమాయకత్వంతో ,అనురాగంతో   పిల్లల పెంపకం కొన సాగించిందని-  కధల ద్వారా     వెలి బుచ్చడం తద్వారా    కాంతం హోదాను పెంచడం  శ్రీ    నరసింహారావు గారి     అభిలాష . కాంతాన్ని పొగుడుతుంటే     ముని  మాణిక్యం   వారు      చిన్డిన్చే    ముసిముసి  నవ్వులు-వారికి కలిగిన సంత్రుప్తికి ,శాంతికి చిహ్నాలుగా    కనిపించెవి. 
               బహుశ: తొ లి  సారిగా    హిందీ  లోకి     అనువదించ బడిన కధలు   కాంతం  కధలే  నెమో!  తర్వాత ఈ   కధలు  రష్యన్    మొదలైన  విదేశీ    భాషల్లోకి ,తమిళం,కన్నడం   మొదలైన  జాతీయ   భాషల్లోకి    అనువదించ   బడినాయి .
                "కాంతం     ప్రసన్న వదనం   నాకు   నిత్యం  గోచరిస్తూనే    వుంటుంది . మూగగా   వున్న  నాకేవో      భావాలు అందిస్తూనే    వుంటుంది . ఆ    ముసిముసి     నవ్వులలో   ముత్యాల   జల్లులు  కురుస్తూ వుండేవి .ఎక్కడ   ఏ    సందర్భంలో  స్త్రీ ని చూసినా  మా   కాంత మైతే  ఈ     సందర్భంలో,    ఈ    సన్నివేశంలో   ఎలా   మాట్లాడుతుంది? అని ఆలోచన   వస్తున్ది.  ఆ ఆలోచనలోంచి  ఒక కదా ఉత్పన్న మయెది. "అని చెప్పారాయన ఒకసారి. 
                             ఆయన  గారెప్పు డైనా   హాస్యంగా    మాట్లాడుతున్నా,ఎవరితో నైనా    సాహిత్య పరమైన   ఘర్షణ     జరిగినా -అవతల  వారు "వుండండి,మీ   కాంతం   గారితో     చెపుతాను"అని హాస్యంగా    అంటూ వుంటారు .  నరసింహారావు  గారు   వెంటనే     నవుకొని "చెప్పండి_ఆవిడ      మీకేమి   జవాబు చెపుతుందో    నాకు తెలుసు. ....... నా విషయంలో    ఆవిడెప్పుడూ     గౌరవం గానే   వుంటుంది . అనేవారెంతో     ధీమాగా. ఇంటి   సంఘటనలనే    ఆయన గారు  కధలుగా  చిత్రించగలిగారు     కొన్నిసార్లు. 
                  కాంతం  ఆంద్ర దేశంలోని సామాన్య కుటుంబానికి చెందినా ఇల్లాలు .... ఆమె మనసెప్పుడూ తన ఇల్లు,పిల్లలు,ప్రియమైన భర్త ,మర్యాదగల    బంధువులు    .. వీరి  మీదనే     తిరుగుతూవుండేది ఆవిడకు    ఘట్టిగా      మాట్లాడటం     తెలుసునేమో గానీ  -గడుసరి తనం చెతకాదు.కొంచెం     సరసం     తెలుసునేమోగానీ , ఘనత   నాపాదించుకోవడం    తెలియదు.మోజులు     వెలిబుచ్చడం     తెలుసునేమో   గానీ,పోజులు     పెట్టడం     తెలియదు. ఆమె     ఏమి మాట్లాడినా   సంసార     పక్షం    గానే     వుంటుంది . ఒకప్పుడు భర్తతో    ఎదిరించి    మాట్లాడినా     అందులో ఏదో    ధర్మ మున్నట్లే    తోస్తుంది ఆమె     సాధు      స్వరూపం   సాహితీ పరుల    హృదయాలలో   చల్లటి మల్లె పందిరు లల్లుకొంది . నరసింహారావు గారి   కాంతం .... ఏదో   దూర తీరాల నుంచి   తెలుగు దేశానికి   సుగంధ   ద్రవ్యాలను    మోసుకు  వచ్చి పంచి పెట్టిన   పూల వాన. 
                              నరసింహారావు గారు   ఆదిలో  పద్య రచనకుఎక్కువ అభిలాష చూపుతూ    వచ్చారట . సాహితీ  సమితి  సభ్యులు   ,ఆసభ్యులకు  "అన్నగారు"  శ్రీ    శివ  శంకర శాస్త్రి   గారు  -ముని మాణిక్యం   వారితో    చెప్పారట ...... "చూడు నరసింహారావ్"నువ్వు కవిత్వం వ్రాయడం మాని    ,కధలు    వ్రాయడానికి పూనుకో .... నీ కలం కధల్లో   చురుకుగా      పరుగెత్తు తుంది అ ని సలహా చెప్పారట ."అన్నగారి"మాట ప్రకారం  ముని మాణిక్యం వారు కధారచన      ప్రారంభించారట .వీరు ప్రఖ్యాత     కదా   కారులు  కావడానికి   శ్రీ శివ శంకర శాస్త్రి గారి     ఆశీర్వాదం ఏంతో     తోడ్పడి   వుంటుంది . 
                          తోలి సారిగా వీరు    "ఉఫ్"  అనే కద   వ్రాసారట ఽఅ కద  అంతా   ఊహా గానం తో   నిండి వుంది . క్రమంగా    వారి కలం గార్హస్త్యజీవితం వేపు   మళ్ళింది . కాంతం    ప్రత్యక్షం    కావడం  తో కమనీయ  భావనలతో     నిండిన  కదా సాహిత్యం      సాక్షాత్కరించింది . కాంతం   మురిపాలు తిరి తీపి     వెన్నెలలు    కురిపించా  సాగాయి. 
                      మునిమాణిక్యం     వారి  కలం  కొంతకాలం    కాంతానికే అంకిత మయ్యింది . నేనూ-నా కాంతం ,కాంతం కైఫియత్ ,కాంతం కధలు,కాంతం కాపురం ,మొదలైన సంపుటా లెన్నో వెలిసినాయి.   అన్నిటిలో క్రొంగొత్త   కాంతులు     విరిసినాయి. 
                         నరసింహారావుగారు     నవలలు  వ్రాయడం లో  సిద్ధ హస్తు లనిపించు కొన్నారు. "వక్రరేఖ"  'అన్నయ మంత్రి "వంటి   చారిత్రాత్మక    నవలలు వ్రాసి మెప్పు పొందారు . వారి "తిరుమాళి గ "  సంసార జీవితాన్ని ఎంతో     చక్కగా     ప్రతి బింబించి నగోప్ప  సాంఘిక   నవల . 
              రావుగారు    గుంటూరు   జిల్లా  లోని  సంగం  జాగర్ల మూడిలో  1898లో  మధ్య తరగతి బ్రాహ్మణ    కుటుంబం లో    జన్మించారు. తండ్రి శ్రీ    సూర్య నారాయణ గారు    ఉపాధ్యాయ వృత్తిలో     పేరు గడించారు . తల్లి రుక్మిణ మ్మగారు  దైవ భక్తీ కల    ఇల్లాలు. 
         నరసింహారావుగారు  తెనాలి,విజయ నగరాలలో     విద్యాభ్యాసం  చెసారు. రాజ మహేంద్ర వరంలో  బి,ఇ డి డిగ్రీ      పుచ్చుకొన్నారు. మొదటభీమవరం లోని ఒక మిషనరీ     స్కూలులో పనిచెసారు. తరువాత బందరు   హిందూ హై స్కూలు లో   చెరారు. ఉపాధ్యాయ పదవి అంతా   అక్కడే  జరిగింది . బందరులో వీరి రచనా    వ్యాసంగం    ఎక్కువగా     కొన సాగిన్ది. ఉత్తమ కధకులుగా     పేరు  కీర్తులు   సంపాదించారు . కృష్ణా పత్రిక దర్బారులో సభ్యులుగా  వుంది,ప్రతి రోజు హాజరై   నవ్వులందించేవారు .  
         తర్వాత హైదరాబాదులోని  ఆకాశ వాణి  కేంద్రంలో   విద్యా శాఖలో   అసిస్టెంట్   ప్రొఫెసరుగా    చెరారు.  అక్కడ నుంచి విర మించుకొన్న    తరువాత  ఆంద్ర సాహిత్య పరిషత్తు     వారు  నిర్వ హించే పండిట్ ట్రైనింగ్   సెంటర్  ప్రిన్సిపాల్ గా  పని చెసారు. 
                  శ్రీ    రావుగారికి ఆంద్ర సారస్వత పరిషత్తు విశిష్ట సభ్యత్వ పదవి  అందించి గౌరవించింది . అనేక సంస్థలు,సమాజాలు వీరిని ఉచిత   రీతిని గౌరవించాయి . 
                 రేడియోలో     వారు అనేక   హాస్య ప్రసంగాలు చెసారు. హాస్య  నాటికలు   వ్రాసారు. మద్రాసు రేడియో    కేంద్రం స్థాపించిన కొత్తలో శ్రీ   ముని  మాణిక్యం   నాటిక  ఒకటి   ప్రసార మైంది . అదే నేను   మొదటగా   రేదోయో నాటిక      వినడం . అదే కేంద్రం నుంచి ప్రధమంగా    ప్రసార మైన నాటిక  అనేది   నేను ఘట్టిగా  చెప్పలేనుకానీ   అదే ప్రదం   హాస్య    నాటికఅని   తెలుసు. 
               ఆరోజుల్లో   రేడియోలు కూడా తక్కువ. శ్రీ  మునిమాణిక్యం వారు నాటిక  వినడానికి  ఎవరింట్లోనో    ఏర్పాటు చేసి   మా  దర్బారీయులందరినీ తీసుకొని వెళ్ళా రు. నాకు బాగా జ్ఞాపకం ఆ  నాటికలో పాల్గొన్న   వారిలో ఒకాయన ఒక   వాక్యం   తప్పు   చెప్పాడు . మునిమాణిక్యం   వారు "అది కాదయ్యా  నేను వ్రాసింది "అని కేక పెట్టా రు.   మేమంతా నవ్వుకొన్నాము. కాతూరివారు "ఊరికే    అలా  కేకలు    పెట్టకయ్యా! వాళ్లకు కోపం    వస్తే    చెక్కు    పంపారు "అన్నారు మళ్ళీ    నవ్వుకొన్నాము. 
                          శ్రీ  నరసింహారావు గారు ఏంటో  కృషి చేసి "మన హాస్యం "అనే గ్రంధం    వ్రాసారు. ఆ గ్రంధాన్ని గురించి  మాట్లాడుతూ "ఇది నిజంగా  శాస్త్రీయ   గ్రంధం ,హాస్య రసానికి చెందిన  ప్రధ మ     శాస్త్రీయ  గ్రంధం  "అన్నారు. 
                          ఈ గ్రంధంలో   హాస్యంతో,చమత్కారంతో, హేళన -అవ హేళ నలతో గల వివిధ స్వరూపాల్ని  చక్కగా  చిత్రించారు.  ఎన్నో చక్కటి ఉదాహరణలిచ్చారు . ఇది వారు చేసిన   ఉత్కృష్ట    సేవ అని   చెప్ప వచ్చు.  
                 నరసింహారావుగారు మెత్తని హృదయం  కలవారు. మిత్రులంటే ఎంతో   ఆశక్తి. అదితి   మర్యాదలలో    అందే వేసిన చెయి. సాహితీ  రంగం లో పందెం   వేసి  పరుగులు    తీసిన   వ్యక్తి. కదా ప్రపంచంలో ఒక     యుగానికి   నాంది   గీతం . 
                              



Wednesday, February 20, 2013

హాస్య రస సింధువు:సాహిత్య బంధువు శ్రీమొక్కపాటి నరసిం హ శాస్త్రి

          హాస్య రస సింధువు: సాహిత్య బంధువు
         శ్రీ మొక్కపాటి  నరసింహ  శాస్త్రి
             
                    తెలుగు సారస్వతానికి కొత్త వన్నె  చిన్నెలు  దిద్దగాలవారెందరో   బయలుదేరారు .వారు అనేక సాహిత్య శాఖల్లో నూతనత్వం    కల్పించి  చైతన్య    స్రవంతి   గా   రూపొందించ   గలిగారు. .
                    అలాంటి     సాహిత వేత్తలలో    హాస్యరస   పోషణకు     పూనుకొన్న వారిలో   శ్రీ   మొక్కపాటి వారికిగొప్ప  స్థానం లభించింది . "పిలక"అనే     వ్యాసం తో ప్రారంభ మైన  వారి   హాస్య రచన   అనేక రీతులుగా,అనేక శా ఖలుగావిస్తరించి,విరితోటగా     అవతరించింది .శాస్త్రి గారు అనేక కధలు,నాటికలు, వ్యాసాలూ  వ్రాసారు. వారు వ్రాసిన "బారిస్టరు  పార్వతీశం"అన్నిటా  తలమానికంగా   నిలిచినది . తెలుగు హాస్య రస   సాహిత్యం లోనే "బారిస్టరు   పార్వతీశం"ఒక ఉన్నత   స్థానాన్ని    అలంకరించింది . అందలి హాస్యం ఎందరి    హృదయాలనో కదిలించి   నవ్వించింది .మొ.క్క పాటి వారి  పార్వతీశం,గురజాడ వారి  గిరీశం    చెట్టా పట్టాలు   వేసుకొని నవ్వుతూ,నవ్విస్తూ సంచ రించడం   సాగించారు  సాహిత్యక   వీధుల్లొ.ఇంకా  ఆజంట    నవ్వుల  పంటలు   పండిస్తూనే వున్నారు .వీరిద్దరూ   డాన్ క్విక్ సాట్ -ఫాల్ స్టా పులతో బంధుత్వం    కలుపుకో గాలిగా రంటే అతిశయోక్తి ఎంత మాత్రం లెదు. పారవ తీశం వెండి తెరమీదకు   కూడా   ఎక్కాడు .పాఠకుల  హృదయాలలో  నక్కినక్కి   అదను దొరికి నప్పుడల్లా    నవ్విస్తూ   వుంటాడు ."బారిస్టరు  పార్వతీశం"  రెండు,మూడు   భాగాలుకూడా  వెలువడి నాయి. "అతనినింకా సరి అయిన    గమ్యానికి     చేర్చ లేదు .దాన్ని గురించి     ఆలో చిస్తున్నాను"అన్నారు శ్రీ శాస్త్రి గారు. .శాస్త్రి  గారి నాటికలలో కూడా    చక్కని హాస్యం     గొచరిస్తుంది .
      మొక్కుబడి-అభ్యుదయం
     ********************
                      మొక్కుబడి    అనే   నాటికలో వెంకటేశ్వర ప్రభువుపై భార్యకు గల విశ్వాసం -భర్తకు     ఆ   విశ్వాశం మీద   అవిశ్వా సమ్. ఈనాతికలో చక్కగా  వర్నించారు.విశ్వాసాలకు గలవిలువను,భక్తిని   నిరూపించడంలో ఈనాటిక  ఫల శృతి నందుకొం ది    అభ్యుదయంలో  మానవత్వానికి,యాంత్రిక యుగానికి ఏర్పడిన సంఘర్షణ   చిత్రించబడింది ంఒదతి ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని   ఈ  నాటిక    వ్రాయ బడింది .దీనిలొ చక్కనినాతకీయతా,సంభాషణా పటిమా గొచరిస్తున్ది. రంగ స్థలానికి    అనువైన   నాటిక  ఇది. ఎప్పటికి సరిపోయే   సందేశం వుంది
       పెద్దమామయ్య
  అసాధారణ   సమావేశం
*******************
                          పెద్ద మామయ్యా అంటే  వూరి పెద్దఽతని మాటకు తిరుగులెదు. కానీ   అతన్ని మోసం చేసి ఒక పెళ్లి చేసిన   వృత్తాంతం    ఈ  నాటికలో     వస్తువు. చక్కని హాస్యం తో నిండి వుంది నాటిక ఎవోఘన కార్యాలు చేయాలని ఏర్పాటైన సంఘాన్ని గురించిన గాధ  . అసాధారణ సమావెశమ్. సమావేశం ఏర్పాటు చెయ్యడం, సభ్యులు ఎవరి గొడవలో వారు పడటం ,కార్య దర్శి గల్లంతులో    పడటం   చిత్రించారు  శ్రీ శాస్త్రి గారు.వివిధ వ్యక్తుల   మన స్తత్వాలు హాస్యరస  ధోరణిలో వర్ణించ బడి నాయి.
     వారసత్వం_పాతివ్రత్యం
    *****************
                           వెంకట్రావు అనే పెద్దమనిషి భార్యకు   బ్రహ్మచారి మేనమామ ఒకడుంటా డు .వెంకత్రావు  ఆఅస్థి కోసం తాపత్రయ పదతాడు .బ్రహ్మ చారి \బ్రతికుండగానే  ఆస్తి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు . అవసరమైతే  ఆబ్రహ్మ చారిణి తామే పోషిస్తామంటాడు . అలాపోషించక తప్పలెదు.  కనీబ్రహ్మ చారి అంతకుముందే      దివాలా  తీసాడు .వెంకత్రావుకి మిగిలింది చాకిరీ  మాత్రమె!
                       పాతివ్రత్యం మం  చి సమస్య గల నాటిక.  నాగరిక లక్షణాలు కల ఒక యువకుడు వివాహ మాడ తాడు .భార్య అమాయకురాలు.   పూర్వ కాలపు మనిషి .ఆవిడ లొ   నాగరిక    లక్షణాలు   కల్పించ లెకపొతాడు భర్త. అతనిలోగల     నాగరికతా   పిపాస     వదల లెదు. అందువల్ల   పరకీయతకు    లోబడతాడు .ప్రాక్పశ్చిమ సంస్కృతుల    సంఘర్షణ    ఈ  నాటికలో   చక్కగా  రూపొందించ   బడింది .
                              శాస్త్రి గారు"కన్నవి,విన్నవి"అనే పేరుతొ   వారి   కధలను  రెండు  సంపుటాలుగా  ప్రచురించారు. వీటిలో పద్దెనిమిది     కధలున్నాయి.   సాంఘిక,రాజకీయ,మత ,సాంస్కృతిక సమస్యలు  వీటిలో    కానీ పిస్తాయి. వీటి అన్నింటిలో      సున్నిత హాస్యం      గొచరిస్తుంది .
        నేను  మా ఆవిడ-
       బండ  సుబ్బుడు
      *************
                   ఒక పెద్దమనిషి    బజారులో  తనని అందరూ ముఖం మీద      పోగతం   వాళ్ళ తను గొప్ప వాణ్ణని విర్ర వీగుతాడు . భార్య మాత్రం    ఆ  విషయం   అంగీకరించదు. అంతటితో  ఊరుకోక   వట్టి  పనికి మాలిని   మనిషి అని కూడా  అంటుంది  ఆయనకు కోపం     వస్తుంది .అంత టితో   ఆవిడగారికి స్వతంత్ర మివ్వడమే     పొరపా టంటారు .ఇక్కడ   చాలా     హాస్య    ప్రధానమైన     సంభాషణ       జరుగుతుంది . "బండ సుబ్బుడు"తన బరువు తగ్గడాని  కి     మందు   పుచ్చుకొంటాడు .పలుచటి    మనిషిగా     మారిపొతాడు గాలిలొ ఎగిరిపోకుండా    బరువుగల    సూట్లు     కుట్టించుకొంటాడు ఆ సూటులో     దాచిన  సీసాలవల్ల   దాని బరువు     మరింత    అయి    అతణ్ణి భూమిమీద   నిల బెడు తుంది  .
       లాభ సాటి బేరం
       అగ్ని పరీక్ష.
      *********
            లాభసాటి బేరం ఏంటో హాస్యం  కల     కధానిక. ఒక బడాయి కో రు   పెద్ద మనిషి      మీసాలు పందెం లో పణం   పెట్ట బడ్డాయి     అ   వి ఒకరు గెలుచుకొన్నారు.  ఆ సమయంలో      ఆ    మీసాల రాయుడొక   సంగీత కచేరీకి వెడుతూ   వుంటాడు. అప్పుడు వాళ్ళు      ఒక వైపు     మీసం మాత్రం    తీసుకొని     తక్కింది     తరువాత  అంటారు .ఈ      దుస్థితి లోంచి   తప్పించుకోడానికి     ఆతడు    -పణం     పెట్టిన మొత్తానికి   రెట్టింపు    డబ్బు     ఇవ్వడానికి    అంగీకరించి   మీసాన్ని రక్షించు కొంటా డు.
    గాజులపాలెం గాంధీ
    ఆకాశ సౌధాలు
   ************
                    గాంధీజీని అనుకరించాలని ప్రయత్నించే అవక తవకల వ్యక్తులపైన      వ్యంగ రచన ఇది.   గాంధీజీ రాజకోటలో ఉప వాసం వున్నా సమయంలో     వ్రాసారీకధ.    ఆ  రోజుల్లో   ఎవరూ  కట్నాలు   తీసుకోరాదనీ,అలా తీసుకొంటే    తానూ   ఆమరణాన్తరమ్    నిరాహార దీక్ష    వహిస్తానని    గాజుల పాలెం   గాంధీ     శపథం చెశాదు.
                    రాజాజీ   అమ్మకం పన్ను విధించిన   సందర్భంలో    శాస్త్రి గారు వ్రాసిన వ్యంగ రచన   ఆకాశ సౌధాలు . శాస్త్రిగారా    సందర్భంలో కొన్ని కొత్త పన్నులు   సూ చించారు. సముద్ర తీరంలో పడుచు   వాళ్ళ వెంట     పడేవారి మీదా ,మీసాలూ గడ్డాలూ ఉన్నవారి మీదా,   పాశ్చాత్య దుస్తులు ధరించే స్త్రీల మీద,   లావుపాటి    వాళ్ళ మీదా,పన్నులు వెయ వచ్చు నన్నారు.  అయితే  కొన్ని కొన్ని      షరతులు  పెట్టారు. గడ్డాల మీద పన్నులు వెయ్యాలి గానీ    ముస్లిం గడ్డాల మీద   వెయకూడదు .లావు వాళ్ళమీద వెయ్య వచ్చుగానీ    కవులూ,గాయకులూ,   నటీనటులు  అయితే   వదిలి వెయ్యాలి.   ఇలా  ఏంతో      హాస్యం కల్పించారీ  కధలొ.
    మా బావు మరిది పెళ్లి
   రంగ    గ్రామ సింహ   రత్తయ్య
***********************
          మా   బావుమరిది పెండ్లి అనేది     మరో కధ.   పెండ్లి కూతురి   తండ్రి పారే కష్టాలూ,తరువాత  తాల్చే   అవతారం ,వగైరాలు   అందులో    వర్ణించ బద్దాయి. ఒక యువకుడు    నటుడుగా  మారి ఆ కధను నిత్య జీవితంలో
కూడా   ప్రతిబింబింప     చేయాలని     తాపత్రయ పడటం ఆ    సంభాషణలతో   ,పోజులతో ఇంట్లో వాళ్ళను దుంప  తెమ్పటం    ఈ కధలో గల   హాస్యమ్. పద్మ వదిన,అగ్ని పరీక్ష, న్యాయం అనే కధలు వ్రాసారు. ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమీ కానీ,ప్రభుత్వం కానీవీరి రచనల్లో   వీరి హాస్యాన్ని మూట     కట్టి దాచడం అవుసరమ్.
       శాస్త్రి గారు,శిల్ప సౌందర్యం హాస్యరసం    అనే   గ్రదాలు వ్రాస్తున్నారు. అవి కూడా   త్వరలో వెలువడ కలవు.శాస్త్రి గారు హాస్యరస సింధువు,గొప్ప సాహిత్య    బన్ధువు.            
        ప్రపంచం లోవున్న    రసమంతా   కలిపితే హాస్యపు విలువకు   తక్కువే   అవుతున్దిఽన్నరొక రచయిత.శాస్త్రి గారి   హాస్యం    మనకు     అమూల్య సంపద ..
                               
[ఇది     మొక్కపాటి వారు     జీవించి వుండగా     రావూరుగారు వ్రాసిన వ్యాసం,ఆంద్ర ప్రభలో ప్రచురిత మయింది .సంవత్సరం     తెలియదు.]

Sunday, February 17, 2013

ఎర్రమబ్బు

                                     ఎర్రమబ్బు

          ఎర్రమబ్బుల  చాటు మాటున
          ఏడు గుర్రాల రధము నెక్కి
          సూర్య దేవుడు బయలు దేరాడు.
               తూర్పు దిక్కున వెలుగు తోచింది.
               ప్రకృతి అంతా సొగసు పరిచింది
          ఎంత అందము ప్రకృతి నోదిగెను!
          ఎంత గానము ప్రకృతి   సాగెను !
                పసిడి లేళ్ళ వి  పరుగులెత్తెను
               చిలుక గుంపులు రెక్కవిసరెను 
               

Tuesday, January 15, 2013

ఉర్వి-ఉయ్యాల

                                     ఉర్వి -ఉయ్యాల

              ఉర్వి యంతా పెద్ద ఉయ్యాల గాగ 
              తారాధ్వమే తళుకు  చాందినీ గాగ 
              దిశలెల్ల  దిగజారు  జలతారు తెరలుగా 
              నాలుగూ ధర్మాలు  బలమైన త్రాళ్ళుగా 
              ఊగుతున్నాడమ్మ   ఊగుతున్నాడు 
              ఉయ్యాలలో స్వామీ    ఊగుతున్నాడు 

              లోకాల పుణ్యమే పులిగోరుకాగా 
              మునుల స్తోత్రంబులే  మొల త్రాడు కాగా 
               ముజ్జగంబుల సౌరు    కాలి గజ్జేలుగా 
              జ్యోతిర్లతా వళులు    చేతి వత్తులుగా 
              కళ్యాణ గానమే   కక్కుటుంగ రమన 
             ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు 

            తోరంపు ఆత్మలే   హారతులు పట్టా 
            వేదాంత వాసనలు  దిశలెల్ల  చుట్ట 
             మూలంపు టమ్మయె   ముంగురులు ముట్ట 
            చైత్రాంగనలె  వచ్చి     చేక్కిళులు   ముట్ట 
              ఊగుతున్నాడమ్మ  ఊగుతున్నాడు 

            జడదారు లెల్లరు పడతులై  వచ్చి 
            పంతాలతో తొట్టి    ప్రక్కలను జేరి 
            కోటి కోయిల లట్లు    గొంతు సవరించి 
           డోల నే ఊపగా    జోలలే పాడగా 
           ఊగుతున్నా డమ్మ -ఊగుతున్నా డు 

           అమల మందాకినీ గలగలల ఓలే 
           ఎందుకయ్యా స్వామీ అన్ని కిలకిలలు 
          పాపాల కొండ ల్లు    పడతన్ను రీతి 
          ఎందుకయ్యా స్వామీ కాలి సాముల్లు 

           బంగారు శంఖులో  ఉంగ నే తెచ్చి 
           అల్లదె వచ్చినది  అమ్మ   యశోద 
           అందుకా నా   స్వామీ అరమోడ్పు కనులు 
           ఎవరు నేర్పారయ్య ఈ కొంటి పనులు ?
           ఉంగ కాదది స్వామీ అమ్మలో బెంగ 
           
          పుప్పొడి గంధాలు కుప్ప పడే నవిగొ!
         నలుగు పెట్టగ వచ్చే   వెలుగైన  ఉషసి 
         పన్నీటి మున్నీరు  ప్రవహించే నదిగొ!
        బొబ్బ పోయగా వచ్చే తొలిప్రొద్దు కన్నె!
        మంద హాసమే  కాని,   తొందరే లేదు  
         తొట్టె లోపలే నీకు పట్టమా స్వామీ?

                  
            
     
               

Tuesday, January 1, 2013

చిరు చిరు మొగ్గల

                    చిరు చిరు   మొగ్గల

రాధ-చిరు   చిరు   మొగ్గల   చిలి పి    తెరలలో
     చిటికెలు   వేయుచు,     చిలిపిగా బ   నవ్వుచు
     వడి  వడిగా   వచ్చెను    వసంతరాగం
    ఎవరి కోసమీ సుమ  భోగం !

కృష్ణ -పిల పిల గాలుల పుప్పొడి దోగ
        ఈలలు వేయుచు     ఎదలను   దోచుచు
        ఆమని రాత్రుల    యామిని రాగా
        ఎవరికోసమీ    అనురాగం!

రాధ-ఎవరి కోసమీ  సుమ భోగం!

కృష్ణ-ఈఅనురాగమ్-ఈ సుమ భోగం !

రాధ -పూల తోటలో-కాలి బాటలో
        మురిపించేడు నీ  మురళి పాటలో
       తూగిన నా ఎద -ఊయెల లూగగా
       ఎన్ని నాళ్ళ దీ   సహయోగం

కృష్ణ-ఎవరి కోసమీ  సుమ భోగం!
        యమునా తీరమున    మురళి   గానమున
        కనులరమూయుచు కాలువలు దూ యుచు
        మయూరివలె    నీ    వయారి    నాట్యం
      ఎవరికోసమాహ్వానము?
రాధ -ఎన్ని నాళ్ళ దీ    సహయోగం!
       మరచిన తలపులు  పరుగిడి రాగా
       విరిసిన   వలపులు   పరువము   దోగా
       మధుర భావనలు  మనసున దోగా
       ఎవరి కోసమీ    మధుమాసం
కృష్ణ-అంతులేని   సహవాసం

రాధా-ఆరిపోని చిరు హాసం