Wednesday, February 20, 2013

హాస్య రస సింధువు:సాహిత్య బంధువు శ్రీమొక్కపాటి నరసిం హ శాస్త్రి

          హాస్య రస సింధువు: సాహిత్య బంధువు
         శ్రీ మొక్కపాటి  నరసింహ  శాస్త్రి
             
                    తెలుగు సారస్వతానికి కొత్త వన్నె  చిన్నెలు  దిద్దగాలవారెందరో   బయలుదేరారు .వారు అనేక సాహిత్య శాఖల్లో నూతనత్వం    కల్పించి  చైతన్య    స్రవంతి   గా   రూపొందించ   గలిగారు. .
                    అలాంటి     సాహిత వేత్తలలో    హాస్యరస   పోషణకు     పూనుకొన్న వారిలో   శ్రీ   మొక్కపాటి వారికిగొప్ప  స్థానం లభించింది . "పిలక"అనే     వ్యాసం తో ప్రారంభ మైన  వారి   హాస్య రచన   అనేక రీతులుగా,అనేక శా ఖలుగావిస్తరించి,విరితోటగా     అవతరించింది .శాస్త్రి గారు అనేక కధలు,నాటికలు, వ్యాసాలూ  వ్రాసారు. వారు వ్రాసిన "బారిస్టరు  పార్వతీశం"అన్నిటా  తలమానికంగా   నిలిచినది . తెలుగు హాస్య రస   సాహిత్యం లోనే "బారిస్టరు   పార్వతీశం"ఒక ఉన్నత   స్థానాన్ని    అలంకరించింది . అందలి హాస్యం ఎందరి    హృదయాలనో కదిలించి   నవ్వించింది .మొ.క్క పాటి వారి  పార్వతీశం,గురజాడ వారి  గిరీశం    చెట్టా పట్టాలు   వేసుకొని నవ్వుతూ,నవ్విస్తూ సంచ రించడం   సాగించారు  సాహిత్యక   వీధుల్లొ.ఇంకా  ఆజంట    నవ్వుల  పంటలు   పండిస్తూనే వున్నారు .వీరిద్దరూ   డాన్ క్విక్ సాట్ -ఫాల్ స్టా పులతో బంధుత్వం    కలుపుకో గాలిగా రంటే అతిశయోక్తి ఎంత మాత్రం లెదు. పారవ తీశం వెండి తెరమీదకు   కూడా   ఎక్కాడు .పాఠకుల  హృదయాలలో  నక్కినక్కి   అదను దొరికి నప్పుడల్లా    నవ్విస్తూ   వుంటాడు ."బారిస్టరు  పార్వతీశం"  రెండు,మూడు   భాగాలుకూడా  వెలువడి నాయి. "అతనినింకా సరి అయిన    గమ్యానికి     చేర్చ లేదు .దాన్ని గురించి     ఆలో చిస్తున్నాను"అన్నారు శ్రీ శాస్త్రి గారు. .శాస్త్రి  గారి నాటికలలో కూడా    చక్కని హాస్యం     గొచరిస్తుంది .
      మొక్కుబడి-అభ్యుదయం
     ********************
                      మొక్కుబడి    అనే   నాటికలో వెంకటేశ్వర ప్రభువుపై భార్యకు గల విశ్వాసం -భర్తకు     ఆ   విశ్వాశం మీద   అవిశ్వా సమ్. ఈనాతికలో చక్కగా  వర్నించారు.విశ్వాసాలకు గలవిలువను,భక్తిని   నిరూపించడంలో ఈనాటిక  ఫల శృతి నందుకొం ది    అభ్యుదయంలో  మానవత్వానికి,యాంత్రిక యుగానికి ఏర్పడిన సంఘర్షణ   చిత్రించబడింది ంఒదతి ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని   ఈ  నాటిక    వ్రాయ బడింది .దీనిలొ చక్కనినాతకీయతా,సంభాషణా పటిమా గొచరిస్తున్ది. రంగ స్థలానికి    అనువైన   నాటిక  ఇది. ఎప్పటికి సరిపోయే   సందేశం వుంది
       పెద్దమామయ్య
  అసాధారణ   సమావేశం
*******************
                          పెద్ద మామయ్యా అంటే  వూరి పెద్దఽతని మాటకు తిరుగులెదు. కానీ   అతన్ని మోసం చేసి ఒక పెళ్లి చేసిన   వృత్తాంతం    ఈ  నాటికలో     వస్తువు. చక్కని హాస్యం తో నిండి వుంది నాటిక ఎవోఘన కార్యాలు చేయాలని ఏర్పాటైన సంఘాన్ని గురించిన గాధ  . అసాధారణ సమావెశమ్. సమావేశం ఏర్పాటు చెయ్యడం, సభ్యులు ఎవరి గొడవలో వారు పడటం ,కార్య దర్శి గల్లంతులో    పడటం   చిత్రించారు  శ్రీ శాస్త్రి గారు.వివిధ వ్యక్తుల   మన స్తత్వాలు హాస్యరస  ధోరణిలో వర్ణించ బడి నాయి.
     వారసత్వం_పాతివ్రత్యం
    *****************
                           వెంకట్రావు అనే పెద్దమనిషి భార్యకు   బ్రహ్మచారి మేనమామ ఒకడుంటా డు .వెంకత్రావు  ఆఅస్థి కోసం తాపత్రయ పదతాడు .బ్రహ్మ చారి \బ్రతికుండగానే  ఆస్తి తీసుకోవాలని ప్రయత్నిస్తాడు . అవసరమైతే  ఆబ్రహ్మ చారిణి తామే పోషిస్తామంటాడు . అలాపోషించక తప్పలెదు.  కనీబ్రహ్మ చారి అంతకుముందే      దివాలా  తీసాడు .వెంకత్రావుకి మిగిలింది చాకిరీ  మాత్రమె!
                       పాతివ్రత్యం మం  చి సమస్య గల నాటిక.  నాగరిక లక్షణాలు కల ఒక యువకుడు వివాహ మాడ తాడు .భార్య అమాయకురాలు.   పూర్వ కాలపు మనిషి .ఆవిడ లొ   నాగరిక    లక్షణాలు   కల్పించ లెకపొతాడు భర్త. అతనిలోగల     నాగరికతా   పిపాస     వదల లెదు. అందువల్ల   పరకీయతకు    లోబడతాడు .ప్రాక్పశ్చిమ సంస్కృతుల    సంఘర్షణ    ఈ  నాటికలో   చక్కగా  రూపొందించ   బడింది .
                              శాస్త్రి గారు"కన్నవి,విన్నవి"అనే పేరుతొ   వారి   కధలను  రెండు  సంపుటాలుగా  ప్రచురించారు. వీటిలో పద్దెనిమిది     కధలున్నాయి.   సాంఘిక,రాజకీయ,మత ,సాంస్కృతిక సమస్యలు  వీటిలో    కానీ పిస్తాయి. వీటి అన్నింటిలో      సున్నిత హాస్యం      గొచరిస్తుంది .
        నేను  మా ఆవిడ-
       బండ  సుబ్బుడు
      *************
                   ఒక పెద్దమనిషి    బజారులో  తనని అందరూ ముఖం మీద      పోగతం   వాళ్ళ తను గొప్ప వాణ్ణని విర్ర వీగుతాడు . భార్య మాత్రం    ఆ  విషయం   అంగీకరించదు. అంతటితో  ఊరుకోక   వట్టి  పనికి మాలిని   మనిషి అని కూడా  అంటుంది  ఆయనకు కోపం     వస్తుంది .అంత టితో   ఆవిడగారికి స్వతంత్ర మివ్వడమే     పొరపా టంటారు .ఇక్కడ   చాలా     హాస్య    ప్రధానమైన     సంభాషణ       జరుగుతుంది . "బండ సుబ్బుడు"తన బరువు తగ్గడాని  కి     మందు   పుచ్చుకొంటాడు .పలుచటి    మనిషిగా     మారిపొతాడు గాలిలొ ఎగిరిపోకుండా    బరువుగల    సూట్లు     కుట్టించుకొంటాడు ఆ సూటులో     దాచిన  సీసాలవల్ల   దాని బరువు     మరింత    అయి    అతణ్ణి భూమిమీద   నిల బెడు తుంది  .
       లాభ సాటి బేరం
       అగ్ని పరీక్ష.
      *********
            లాభసాటి బేరం ఏంటో హాస్యం  కల     కధానిక. ఒక బడాయి కో రు   పెద్ద మనిషి      మీసాలు పందెం లో పణం   పెట్ట బడ్డాయి     అ   వి ఒకరు గెలుచుకొన్నారు.  ఆ సమయంలో      ఆ    మీసాల రాయుడొక   సంగీత కచేరీకి వెడుతూ   వుంటాడు. అప్పుడు వాళ్ళు      ఒక వైపు     మీసం మాత్రం    తీసుకొని     తక్కింది     తరువాత  అంటారు .ఈ      దుస్థితి లోంచి   తప్పించుకోడానికి     ఆతడు    -పణం     పెట్టిన మొత్తానికి   రెట్టింపు    డబ్బు     ఇవ్వడానికి    అంగీకరించి   మీసాన్ని రక్షించు కొంటా డు.
    గాజులపాలెం గాంధీ
    ఆకాశ సౌధాలు
   ************
                    గాంధీజీని అనుకరించాలని ప్రయత్నించే అవక తవకల వ్యక్తులపైన      వ్యంగ రచన ఇది.   గాంధీజీ రాజకోటలో ఉప వాసం వున్నా సమయంలో     వ్రాసారీకధ.    ఆ  రోజుల్లో   ఎవరూ  కట్నాలు   తీసుకోరాదనీ,అలా తీసుకొంటే    తానూ   ఆమరణాన్తరమ్    నిరాహార దీక్ష    వహిస్తానని    గాజుల పాలెం   గాంధీ     శపథం చెశాదు.
                    రాజాజీ   అమ్మకం పన్ను విధించిన   సందర్భంలో    శాస్త్రి గారు వ్రాసిన వ్యంగ రచన   ఆకాశ సౌధాలు . శాస్త్రిగారా    సందర్భంలో కొన్ని కొత్త పన్నులు   సూ చించారు. సముద్ర తీరంలో పడుచు   వాళ్ళ వెంట     పడేవారి మీదా ,మీసాలూ గడ్డాలూ ఉన్నవారి మీదా,   పాశ్చాత్య దుస్తులు ధరించే స్త్రీల మీద,   లావుపాటి    వాళ్ళ మీదా,పన్నులు వెయ వచ్చు నన్నారు.  అయితే  కొన్ని కొన్ని      షరతులు  పెట్టారు. గడ్డాల మీద పన్నులు వెయ్యాలి గానీ    ముస్లిం గడ్డాల మీద   వెయకూడదు .లావు వాళ్ళమీద వెయ్య వచ్చుగానీ    కవులూ,గాయకులూ,   నటీనటులు  అయితే   వదిలి వెయ్యాలి.   ఇలా  ఏంతో      హాస్యం కల్పించారీ  కధలొ.
    మా బావు మరిది పెళ్లి
   రంగ    గ్రామ సింహ   రత్తయ్య
***********************
          మా   బావుమరిది పెండ్లి అనేది     మరో కధ.   పెండ్లి కూతురి   తండ్రి పారే కష్టాలూ,తరువాత  తాల్చే   అవతారం ,వగైరాలు   అందులో    వర్ణించ బద్దాయి. ఒక యువకుడు    నటుడుగా  మారి ఆ కధను నిత్య జీవితంలో
కూడా   ప్రతిబింబింప     చేయాలని     తాపత్రయ పడటం ఆ    సంభాషణలతో   ,పోజులతో ఇంట్లో వాళ్ళను దుంప  తెమ్పటం    ఈ కధలో గల   హాస్యమ్. పద్మ వదిన,అగ్ని పరీక్ష, న్యాయం అనే కధలు వ్రాసారు. ఆంద్ర ప్రదేశ్  సాహిత్య అకాడెమీ కానీ,ప్రభుత్వం కానీవీరి రచనల్లో   వీరి హాస్యాన్ని మూట     కట్టి దాచడం అవుసరమ్.
       శాస్త్రి గారు,శిల్ప సౌందర్యం హాస్యరసం    అనే   గ్రదాలు వ్రాస్తున్నారు. అవి కూడా   త్వరలో వెలువడ కలవు.శాస్త్రి గారు హాస్యరస సింధువు,గొప్ప సాహిత్య    బన్ధువు.            
        ప్రపంచం లోవున్న    రసమంతా   కలిపితే హాస్యపు విలువకు   తక్కువే   అవుతున్దిఽన్నరొక రచయిత.శాస్త్రి గారి   హాస్యం    మనకు     అమూల్య సంపద ..
                               
[ఇది     మొక్కపాటి వారు     జీవించి వుండగా     రావూరుగారు వ్రాసిన వ్యాసం,ఆంద్ర ప్రభలో ప్రచురిత మయింది .సంవత్సరం     తెలియదు.]

Sunday, February 17, 2013

ఎర్రమబ్బు

                                     ఎర్రమబ్బు

          ఎర్రమబ్బుల  చాటు మాటున
          ఏడు గుర్రాల రధము నెక్కి
          సూర్య దేవుడు బయలు దేరాడు.
               తూర్పు దిక్కున వెలుగు తోచింది.
               ప్రకృతి అంతా సొగసు పరిచింది
          ఎంత అందము ప్రకృతి నోదిగెను!
          ఎంత గానము ప్రకృతి   సాగెను !
                పసిడి లేళ్ళ వి  పరుగులెత్తెను
               చిలుక గుంపులు రెక్కవిసరెను